సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: రాము

68చూసినవారు
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: రాము
ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తానని పెడన నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పెడన పట్టణంలోని 23వ వార్డులో ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లిన ఆయన రానున్న ఎన్నికల్లో తనకు ఓట్లువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్