సహాయం కోసం ఎదురుచూపులు

80చూసినవారు
గత ఆరు రోజులుగా వరద ముంపుకు గురైన బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం కబేలా సెంటర్ నందు వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. ఆ వరద నీటిలోనే మెట్ల పైన కూర్చుని ఎవరైనా సహాయం చేయకపోతారా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వారి వద్దకే మంచినీరు ఆహారాన్ని అందిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల అవి కూడా అందకపోవటంతో ఆకలి కడుపుతో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్