ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళన

84చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నందు ఓ బాబు చనిపోయిన సంఘటనలో కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేపట్టారు. శనివారం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ బాబుకు జన్మనిచ్చింది. పుట్టిన కొంతసేపుకే చనిపోవడంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చనిపోయారంటూ ఆందోళనకు దిగారు. దీనిపై స్థానిక పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని నిరసన తెలియజేసిన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్