కనకదుర్గమ్మని దర్శించుకున్న హోంమంత్రి అనిత

57చూసినవారు
కనకదుర్గమ్మని దర్శించుకున్న హోంమంత్రి అనిత
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గురువారం తొలిరోజున శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో కొలువై ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో హోంమంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి దర్శనాంతరం వేద పండితులు హోం మంత్రి అనితకు ఆశీర్వచనాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్