స్వామి వారి సన్నిధిలో ప్రభుత్వ అదనపు న్యాయ కార్యదర్శి

68చూసినవారు
మోపిదేవిలో కొలువు తీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రభుత్వ అదనపు న్యాయ కార్యదర్శి వడ్డాది సునీత దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన సునీత, శ్రీకాకుళం జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు సిహెచ్ షణ్ముఖరావు దంపతులకు ఆలయ అర్చకులు స్వాగతం పలకగా, ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు శనివారం చెల్లించుకున్నారు. ఆలయ పండితులు వారిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్