300మంది వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ

62చూసినవారు
300మంది వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ
ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి కోట రాఘవయ్య విద్యాసంస్థల వారు రూ. 1. 60 లక్షలతో నిత్యావసరాలను సమకూర్చారు. సోమవారం అవనిగడ్డ మండల పరిధిలోని దక్షిణ చిరువోలులంక గ్రామంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ చేతులు మీదుగా నిత్యవసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్