మోపిదేవి : రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి

57చూసినవారు
మోపిదేవి : రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి
సమస్యల పరిష్కార వేదిక రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని మోపిదేవి తహసీల్దార్ శ్రీవిద్య కోరారు. మంగళవారం మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామ పంచాయతీలో ఏపీ రీ-సర్వే ప్రాజెక్టు ద్వారా చేసిన రీ-సర్వేలో వచ్చిన భూ సమస్యల పరిష్కార గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి సమస్యలను తహసీల్దార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యర్రంశెట్టి ధనరాజ్యలక్ష్మి, మండల సర్వేయర్ రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్