ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, పోలేరమ్మ ఆలయంలో దొంగలు దొంగతనాలకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున కనకదుర్గమ్మ ఆలయంలో దొంగలు అమ్మవారికి దండం పెట్టుకొని దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తాళాలు పగలగొట్టి అమ్మవారి త్రిశూలం, హుండీ పగలగొట్టి అందులోని డబ్బులు అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.