సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించడంతో గుడివాడ ఆసుపత్రి ప్రాంగణంలో రోదనలు మిన్నంటాయి. గుడివాడ బస్టాండ్ సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడివాడ ముబారక్ సెంటర్ కాకర్ల వీధికి చెందిన సోహెల్, సాయి, హర్షలు మృతి చెందారు. వీరి మరణ వార్త తెలుసుకున్న వెంటనే బంధువులు, స్నేహితులు ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి.