పేకాట శిబిరాలపై పోలీసుల దాడి

52చూసినవారు
పేకాట శిబిరాలపై పోలీసుల దాడి
నందివాడ మండలంలోని పేకాట పందాల శిబిరంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఎస్సై కుడిపూడి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తనకు రాబడిన సమాచారం మేరకు తన సిబ్బందిని వెంటపెట్టుకొని మండలంలోని వెన్ననపూడి, రామాపురం గ్రామంలో పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నామన్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 3440 ల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్