ఆక్రమణల తొలగింపులో పేదలకు అన్యాయం జరగదు: మంత్రి

78చూసినవారు
ఆక్రమణల తొలగింపు పేరుతో ఏ ఒక్క నిరుపేదకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేయదని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం రాత్రి మచిలీపట్నంలో మాట్లాడిన ఆయన ఆపరేషన్ బుడమేరు వంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తామన్నారు. ఆక్రమణదారుల్లో చాలా మంది నిరుపేదలు ఉంటారని, వారికి ప్రత్యామ్నాయం చూపి ఆక్రమణల తొలగింపులు ఉంటాయన్నారు. ఆక్రమణలు చేసి ఉంటే స్వచ్ఛందంగా ఖాళీ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్