మంగినపూడి బీచ్ శుభ్రం చేసిన విద్యార్థులు

50చూసినవారు
మంగినపూడి బీచ్ శుభ్రం చేసిన విద్యార్థులు
మచిలీపట్నంలోని శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నేషనల్ సర్వీసెస్ స్కీం వాలంటీర్స్ మచిలీపట్నం మంగినపూడి బీచ్ ని గురువారం శుభ్రపరిచారు. స్వచ్ఛతహి సేవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పరిసరాలు శుభ్రంగా ఉండాలని, ప్లాస్టిక్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఈ సందర్భంగా అధ్యాపకులు పిలుపునిచ్చారు. సముద్ర తీరంలోని వ్యర్ధాలు తొలగించారు.

సంబంధిత పోస్ట్