ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేందుకు వైకాపా కుట్ర: మంత్రి

64చూసినవారు
ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేందుకు వైకాపా పడవలను బ్యారేజి గేట్లు ఢీకొట్టేలా కుట్ర పన్నిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. వరద బాధితులు పరామర్శించడానికి ఆయనకు సమయం లేదని, ఖైదీలను పరామర్శించడానికి సమయం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్