భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అధికార వికేంద్రీకరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గరిమెళ్ళ గోపాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. జి. కొండూరు మండలం కవులూరులో శనివారం మీడియాతో మాట్లాడుతూ, అధికార వికేంద్రీకరణ అంటే ప్రజాస్వామ్యంలో అందరికీ సామాన్య ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రజాప్రతినిధులకు విలువలు లేకుండా చేశారన్నారు.