మైలవరం: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

52చూసినవారు
మైలవరం: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
మైలవరంలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైలవరంకు చెందిన బొంక రాజు (55) సోమవారం వెల్వడం బుదవేరు వాగులోకి చేపల వేటకు వెళ్లారు. మంగళవారం వరకు అతని ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు మైలవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. చేపల వేటకి వెళ్ళిన కొంతమంది వ్యక్తులు బొంక రాజు కాల్వలో పడి మరణించినట్లు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసారు. పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్