మైలవరం: పంగిడి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

63చూసినవారు
మైలవరం: పంగిడి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే
మైలవరం మండలం పొందుగల గ్రామంలో పంగిడి చెరువును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం పరిశీలించారు. గత నెలలో అకస్మాత్తుగా కురిసిన మహాకుంభవృష్టికి పంగిడి చెరువు కరకట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో వసంత ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన స్థానిక నాయకులు పంగిడి చెరువు కట్టకు పడిన గండిని పూడ్చివేశారు. చెరువును అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్