మైలవరం పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు

1075చూసినవారు
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలు తమకు సహకరించాలని మైలవరం డివిజినల్ ఏసిపి మురళీమోహన్ కోరారు. మంగళవారం మైలవరంలో కార్డన్ సెర్చ్ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మైలవరం తారకరామా నగర్ ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి తనిఖీ అనంతరం సరైన వాహనాలను సిబ్బంది యజమానులకు అప్పగించారు. అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్