ఇబ్రహీంపట్నంలో పారదర్శకంగా సొసైటీ నిర్వహణ

81చూసినవారు
మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలో ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్ లిమిటెడ్ సొసైటీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండాపారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు సుబ్బరాజు తెలిపారు. సొసైటీలో అక్రమాలు జరిగినట్లు వార్తలు రావడంపై ఆదివారం స్పందించారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపైనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మెజార్టీ సభ్యుల మద్దతుతోనే సమావేశం, తీర్మానాలు ఆమోదం పొందాయన్నారు.

సంబంధిత పోస్ట్