వేసవిలో త్రాగునీటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి అధికారులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ఆదేశానుసారం నందిగామ మండలం రామన్నపేటలోని ఫిల్టర్ బెడ్ లను మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణ కుమారి పరిశీలించారు.