నూజివీడు: 22న జాతీయ రైతు సదస్సును జయప్రదం చేయండి

67చూసినవారు
ఈనెల 22న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ రైతు సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. నూజివీడులో సుందరయ్య భవనంలో జాతీయ రైతు సదస్సు కరపత్రాలను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ. వ్యవసాయ రంగ సమస్యలపై ఈ సదస్సులో చర్చించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్