ముంపు పొలాలను పరిశీలించిన డివై దాస్

65చూసినవారు
పామర్రు నియోజకవర్గ పరిధిలోని పమిడిముక్కల మండలం దూళ్ళిపూడి పాలెం లో ముంపుకుగురైన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే డివై దాస్ శుక్రవారం సందర్శించారు. బొడ్డంకి లాకులు ఎత్తివేయడంతో వరద నీరు తమ పంట పొలాల్లోకి చొచ్చుకొని వచ్చాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కనిగిరి మడుగు గుర్రపు డెక్కతో నిండిపోయి ఉందని రైతులు ఈ సందర్భంగా దాస్ కి తెలిపారు. ఫలితంగా పొలాల్లో వర్షాలకు ముంపు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్