చిట్టీల పేరుతో ఘరానా మోసం

56చూసినవారు
చిట్టీల పేరుతో ఘరానా మోసం
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఓ వ్యక్తి చిట్టీల వ్యాపారంతో మోసానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాగిత శివకుమార్ అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల నుంచి చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. అమాయకులైన గ్రామ ప్రజల నమ్మకాన్ని సొమ్ముచేసుకున్నాడు. ఈ క్రమంలో 18 మందిని నట్టేటా ముంచి 50 లక్షల రూపాయలతో అతడు పరారైయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్