వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పింఛన్ల పంపిణీ పూర్తి

81చూసినవారు
అవనిగడ్డ నియోజకవర్గం అశ్వరావుపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ -6 డి. పద్మావతి 70 పింఛన్లకు 70 పింఛన్లను శనివారం ఉదయాన్నే పంపిణీ చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నీటిలో నడుస్తూ లబ్ధిదారులు ఇళ్లకు తిరిగి పింఛన్లను పంపిణీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించడం పట్ల ప్రజలు ఆమెకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్