రాష్ట్రంలో 25 సంవత్సరాల పాటు వైసిపిదే అధికారం అని, పెనమలూరు గడ్డమీద వైఎస్ఆర్ జెండా ఎగరవేసి ఎమ్మెల్యేగా తనను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని పెనమలూరు వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయకర్త, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. శనివారం రాత్రి పెనమలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం పార్టీ కార్యాలయ ఆవరణంలో నిర్వహించారు.