గంపలగూడెం కట్టలేరు వాగు కు కొనసాగుతున్న వరద ఉధృతి

565చూసినవారు
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం వినగడప కట్టులేరు వాగుకు వరద నీరు ఉధృతి శనివారం కొనసాగుతుంది. దీంతో ఈ వాగుపై రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత వారం రోజులుగా సుమారు 20 గ్రాములకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్