తిరువూరు ప్రాంతంలో నీట మునిగిన వరి పొలాలు

70చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని విసన్నపేట మండలం పుట్రెల గ్రామంలో గల విసన్నపేట వెళ్లే రోడ్డులో భారీ వర్షాలకు ఆదివారం వరి పొలాలు నీటి మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలు ఈ భారీ వర్షపు నీటిలో పాడైపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని ఈ భారీ వర్షపు నీరు ముంచెత్తింది అని చెప్పుకోవచ్చు. అనేక గ్రామాల్లో రాకపోకలకు తీవ్రo అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్