వైసిపి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని తిరువూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ అన్నారు. శుక్రవారం గంపలగూడెం మండలం చింతలపర్వ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. వైసిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.