విజయవాడ కొండపై భవానీల కళకళ

63చూసినవారు
విజయవాడ కొండపై భవానీల కళకళ
విజయదశమి పర్వదినానికి 11 రోజుల ముందు భవానీ దీక్ష ప్రారంభించి జగన్మాతను దర్శించుకుంటే సకల ఫలాలు దొరుకుతాయని వివిధ హిందూ గ్రంధాలలో పేర్కొనబడింది. ఆయా గ్రంధాలను ప్రామాణికంగా తీసుకొని రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం భవానీ దీక్షను స్వీకరిస్తున్న భక్తులు శుక్రవారం కొండకు చేరుకోవడం ప్రారంభించారు. భవానీలతో పోటెత్తింది. జై భవానీ.. జైజై.. జ‌గ‌జ్జ‌న‌నీ నామస్మరణతో, భవానీల ప్రభంజనంతో కొండ ఎరుపెక్కింది.

సంబంధిత పోస్ట్