విజయవాడ: అమ్మవారికి సారె సమర్పించిన కాణిపాకం దేవస్థానం

55చూసినవారు
విజయవాడ: అమ్మవారికి సారె సమర్పించిన కాణిపాకం దేవస్థానం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి సారె సమర్పించడం సాంప్రదాయంగా వస్తోంది. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున ప్రత్యేక బృందం మహాలక్ష్మి దేవి అలంకృత అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు.

సంబంధిత పోస్ట్