రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్తోనే సాధ్యం: దేవినేని

61చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యమవుతుందని విజయవాడ తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాశ్ అన్నారు. మంగళవారం నగర పరిధిలోని 16వ డివిజన్లో ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఆయన వివరించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్