జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ నేత పోతిన మహేశ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ పని చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు జనసేన పార్టీనే లేదన్నారు. జైలులో చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ ఆస్తులు పెరిగాయని చెప్పారు. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలను త్వరలో బయటపెడతానని పోతిన మహేశ్ హెచ్చరించారు.