కార్మిక హక్కులను కాలరాసే ప్రభుత్వాలకు ఇచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిఐటియు జిల్లా నాయకులు ఈరన్న, మహానంది రెడ్డి, పిఎస్ గోపాల్, లక్ష్మన్న పిలుపునిచ్చారు. మంగళవారం ఆదోనిలోని సుందరయ్య భవన్లో విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ, కార్మిక, కర్షక ఐక్యత చాటి చెప్పేందుకు మే 1న మేడే దినోత్సవ సభకు కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.