కాటికాపరులను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఉపాధి కల్పించాలని కాటికాపరి గుంతలుతీసే బేగరుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యండి ఆనంద్ బాబు, ఎన్జి కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఆదోనిలోని స్మశాన ఘాట్ వద్ద సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధి కల్పించే వరకు వివిధ రూపాలలో ఉద్యమించేందుకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. యువరాజు, వీరేష్, రాజా రమేష్, ఈశ్వరయ్య పాల్గొన్నారు.