ఓటు హక్కు నమోదు చేసుకోవాలి: కలెక్టర్

76చూసినవారు
ఓటు హక్కు నమోదు చేసుకోవాలి: కలెక్టర్
ఓటు హక్కును నమోదు చేసుకోనివారు నమోదుకు 2 రోజులు మాత్రమే గడువు ఉందని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి. సృజన శనివారం పేర్కొన్నారు. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుందన్నారు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్