ఎరువుల దుకాణాల పై రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు

62చూసినవారు
ఎరువుల దుకాణాల పై రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు
మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో మారుతి ట్రేడర్స్ దుకాణం నందు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి జీరా గణేష్ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు నుండి వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఎరువులకు సంబంధించి తనిఖీ సమయంలో సుమారుగా 11, 62, 742 రూపాయలు విలువ గల స్టాక్ ను తనిఖీ సమయంలో సరైన పత్రాలు చూపనందున అమ్మడానికి వీలు లేకుండా చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్