పాణ్యంలో భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ వేడుకలు

85చూసినవారు
పాణ్యంలో భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
మహమ్మద్‌ ప్రవక్త జన్మదిన వేడుకలను పాణ్యం నియోజకవర్గంలో ముస్లింలు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ముస్లిం మత పెద్దలు సభ్యులు ఏర్పాటు చేసిన మిలాద్ ఉన్ నబి జల్సా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి పూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అన్నారు.

సంబంధిత పోస్ట్