ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా మండల కేంద్రమైన తుగ్గలిలో నవరత్నాలు పథకాలు అందుకున్న మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. వైయస్ జగన్మోహన్ రాక కొరకు నిరీక్షణ వహించిన మహిళలు ఆనందం పట్టలేక వైసిపి పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేశారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.