సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన పెంచాలి
By W. Abdul 73చూసినవారువర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు డిఎంహెచ్ఓ సూచించారు. మంగళవారం ఆదోని మున్సిపల్ హాలులో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిని నిలువ ఉంచకుండా, దోమలు వృద్ధి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని అన్నారు.