ఆదోనిలో ముగ్గురు విద్యార్థినులకు అస్వస్థత

84చూసినవారు
ఆదోనిలో ముగ్గురు విద్యార్థినులకు అస్వస్థత
ఆదోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు కళాశాలలో అస్వస్థతకు గురయ్యారు. కాలేజీలో మహాలక్ష్మి, శిరీష, సింధు అనే విద్యార్థులు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. తోటి విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రి వైద్యుల బృందం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్