విద్యతోనే బంగారు భవిష్యత్ ఉంటుంది

80చూసినవారు
విద్యతోనే బంగారు భవిష్యత్ ఉంటుంది
ఆలూరు విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మొలగవల్లి సర్పంచు మోహన్ రాజ్ అన్నారు. గురువారం బీసీ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులను సర్పంచు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా, ఇష్టపడి చదవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ పాఠశాలల విద్యాభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. హెచ్ఎం వెంకటరాముడు, ఉసేని, విశ్వతేజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్