తుంగభద్ర జలాశయానికి పెరిగిన వరద నీటి ప్రవాహం

81చూసినవారు
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగిందని తుంగభద్ర డ్యాం బోర్డు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జలాశయం ఎగువన వర్షాలు వస్తుండటంతో 28, 832 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 90. 23 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. వివిధ కాల్వలకు 9, 900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్