నంద్యాల కలెక్టర్ కె. శ్రీనివాసులు కొలిమిగుండ్ల ఎంపీడీవో సాయిక్రిష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక పింఛన్ కార్యక్రమంపై శనివారం కలెక్టర్ ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. అయితే కొలిమిగుండ్ల నుంచి ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో సహా కార్యాలయం నుంచి ఎవ్వరూ పాల్గొనకపోవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.