Jun 09, 2024, 16:06 IST/రాజేంద్రనగర్
రాజేంద్రనగర్
పరీక్ష కేంద్రాలకు చేరుకున్న గ్రూప్ 1 అభ్యర్థులు
Jun 09, 2024, 16:06 IST
పరీక్ష కేంద్రాలకు ఆదివారం గ్రూప్ 1 అభ్యర్థులు చేరుకున్నారు. నిమిషం నిబంధన అమలుతోపాటు వర్ష సూచన నేపథ్యంలో గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీస్ సిబ్బంది అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కేంద్రాల వద్ద అభ్యర్థుల కోసం తగు జాగ్రత్తలతో కూడిన అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.