కోడుమూరులో మద్యం పట్టివేత
కోడుమూరు సెబ్ పరిధిలోని వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలో సోమవారం 88 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. నిందితుడు ఈడిగ షేక్షావలిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వెల్దుర్తి మండలం పిక్కిలివాండ్లపల్లి వద్ద నాటుసారా స్థావరంపై దాడి చేసి 200 లీటర్ల ఊటను ధ్వంసం చేసి, 15 లీటర్ల సారాను సీజ్ చేసినట్లు వెల్లడించారు. రామాంజనేయులు అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు.