AP: తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబ్లోని పారా మెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు ఫిర్యాదు వచ్చాయి. నం.13 సెంట్రల్ ల్యాబ్లో వెంకట్, రాజశేఖర్ అనే ఇద్దరు టెక్నీషియన్లు.. కొందరు పారా మెడికల్ విద్యార్థినులను వేధిస్తున్నట్లు బాధితులు లిఖితపూర్వకంగా ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్కు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టాలని రుయా ఎంఎస్కు ఫిర్యాదు పంపారు.