ప్రతిరోజు క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలి

56చూసినవారు
ప్రతిరోజు క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలి
ప్రతిరోజు క్లోరినేషన్ చేసిన తర్వాతనే కొళాయిల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేయాలని కోడుమూరు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రసాద్ గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం వర్కూరును సందర్శించారు. మంచినీటిని సరఫరా చేసే బోర్లు, ట్యాంకును పరిశీలించారు. ఏఈ మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ప్రతి 15 రోజులకోసారి ట్యాంకును తప్పనిసరిగా శుభ్రపరచాలని, నీటి పైపులైన్లకు లీకేజీలు లేకుండా చూసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్