కోడుమూరులో వైభవంగా దసరా శరన్నవరాత్రోత్సవాలు

52చూసినవారు
దసరా శరన్నవరాత్రోత్సవాలు గురువారం కోడుమూరు నియోజకవర్గంలో భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. కాళికాదేవి, వల్లెలాంబదేవి, కన్యకా పరమేశ్వరీ, చౌడేశ్వరీదేవి, సుంకులాపరమేశ్వరి అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లు బాలత్రిపుర సుందరి దేవి, ఆదిలక్ష్మిదేవి రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వల్లెలాంబదేవికి మాజీ కుడా చైర్ మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి దంపతులు వైభవంగా పల్లకీసేవా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్