ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే దస్తగిరి

52చూసినవారు
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. గురువారం కె. నాగలాపురంలో వంద రోజులలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజా వేదిక గ్రామసభకు ఎమ్మెల్యే హాజరై, మాట్లాడారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసకెళ్తున్నారన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారన్నారు.

సంబంధిత పోస్ట్