సుంకేసులకు 11, 403 క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో

78చూసినవారు
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల జలాశయానికి గురువారం ఉదయం 11, 403 క్యూసెక్కుల ఇన్ ఫ్లోగా నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వాయర్ నుంచి 2 గేట్లు ఎత్తి 8, 958 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కేసీ కెనాల్ కు 2, 445 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

సంబంధిత పోస్ట్