కర్నూలు ఎంపీ నాగరాజు దృష్టికి కోడుమూరు సమస్యలు

75చూసినవారు
కర్నూలు ఎంపీ నాగరాజు దృష్టికి కోడుమూరు సమస్యలు
కోడుమూరు మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం మండల కార్యదర్శి గఫూర్మియ్యా, జిపి వీరన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును కోరారు. సోమవారం కోడుమూరుకు వచ్చిన ఎంపీ నాగరాజును కలసి మాట్లాడారు. మండల కేంద్రంలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని, బాగు చేయించాలని కోరారు. నిత్యం రద్దీగా ఉండే కోడుమూరులో రోడ్డు అధ్వానంగా ఉందన్నారు. స్పందించిన ఎంపీ సమస్యకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్